Saturday, April 27, 2024

Big Breaking | తెలంగాణలో 31 మంది ఐఏఎస్​ అధికారుల బదిలీ.. పోస్టింగులు ఇవే..

తెలంగాణలో భారీగా ఐఏఎస్​ అధికారుల బదిలీ జరిగింది. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన బదిలీలకు సంబంధించి సీఎస్​ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. బదిలీల్లో 31 మంది ఐఏఎస్​ అధికారులున్నారు. ఇందులో ఎంసీఆర్​ హెచ్​ఆర్​డీ డీజీగా శశాంక్​ గోయాల్​ బదిలీ అయ్యారు. ఇక.. యువజన శాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీగా శైలజా రామయ్యర్​, ఆయుష్​ డైరెక్టర్​గా హరిచందన దాసరి, హ్యాండ్లూమ్స్​ అండ్​ టెక్స్​టైల్స్​ డైరెక్టర్​గా వర్షిణి బదిలీ అయ్యారు.

స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీ డైరెక్టర్​గా కుర్రా లక్ష్మి, ఎయిడ్స్​ సొసైటీ డైరెక్టర్​గా హైమావతి, ఆర్థిక శాఖ జాయింట్​ సెక్రెటరీగా కె. హరిత బదిలీ కాగా.. కె. స్వర్ణలత జీఏడీకి బదిలీ అయ్యారు. టూరిజం డైరెక్టర్​గా కె. నిఖిల, అగ్రికల్చర్​ డిప్యూటీ డైరెక్టర్​గా సత్య శారదాదేవి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​గా ప్రియాంకా, ములుగు కలెక్టర్​గా ఇలా త్రిపాఠి, పొల్యూషన్​ బోర్డు మెంబర్​ సెక్రెటరీగా కృష్ణ ఆదిత్యా, పెద్దపల్లి కలెక్టర్​గా ముజామిల్​ ఖాన్​, టీఎస్​ ఫుడ్స్​ ఎండీగా సంగీత సత్యనారాయణ, భద్రాద్రి ఐటీడీఏ పీడీగా ప్రతీక్​ జైన్​, సెర్ఫ్​ సీఈవోగా గౌతమ్​ పొట్రూ, మహబుబ్​నగర్​ అడిషనల్​ కలెక్టర్​గా వెంకటేశ్​ దౌత్రే, ఖమ్మం అడిషనల్​ కలెక్టర్​గా అభిలాష అభినవ్​, జీహెచ్​ఎంసీ అడిషనల్​ కలెక్టర్​గా స్నేహ శబరిష్​, కామారెడ్డి అడిషనల్​ కలెక్టర్​గా మను చౌదరి, జగిత్యాల అడిషనల్​ కలెక్టర్​గా టీఎస్​ దివాకర్​ బదిలీ అయ్యారు..

ఇక.. హైదరాబాద్​ కలెక్టర్​గా  అనుదీప్​ దురిశెట్టి, నాగర్​కర్నూల్​ అడిషనల్​ కలెక్టర్​గా కుమార్​ దీపక్​, పెద్దపల్లి అడిషనల్​ కలెక్టర్​గా చెక్క ప్రియాంక, కరీంనగర్​ అడిషనల్​ కలెక్టర్​గా అరుణశ్రీ, సంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్​గా చంద్రశేఖర్​, రంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్​గా ప్రతిమాసింగ్​, సిద్దిపేట అడిషనల్​ కలెక్టర్​గా గరిమా అగర్వాల్​, నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​గా మకరందు, సోషల్​ వెల్ఫేర్​ స్కూల్స్​ సెక్రెటరీగా నవీన్​ నికోలస్​ బదిలీ అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement