Saturday, April 27, 2024

TS : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేకే.. కాంగ్రెస్ లో చేరికపై చర్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు సమావేశం ముగిసింది. కాంగ్రెస్‌లో చేరుతానని అధికారికంగా ప్రకటించిన కేకే శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించారు.

చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచి కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement