Sunday, May 19, 2024

భద్రకాళి గుడిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. . ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, ధర్మ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి,నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… భారత ప్రభుత్వం వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని తెలిపారు. రామప్పకు మొదటిసారి విఫలమైనా రెండోసారి ప్రయత్నించి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement