Wednesday, May 22, 2024

Breaking : ఏపీలో ఆచార్య మూవీ టిక్కెట్స్ ధ‌ర‌లు పెంచుకోవ‌చ్చు – ప‌ర్మిష‌న్ ఇచ్చిన స‌ర్కార్

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఆచార్య చిత్రం టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకోవ‌డ‌మే కాదు..ఐదు ఆట‌ల‌కి అనుమ‌తినిచ్చింది. కాగా ఇప్పుడు ఏపీలో కూడా ఆచార్య చిత్రం టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. కానీ ఐదు షోలు వేసుకోవ‌చ్చా అనే దానిపై క్లారిటీ లేదు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం… ఇప్పటి వరకు కొరటాల డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మాసీవ్ హిట్లుగా నిలవడంతో ఆచార్య కూడా తప్పకుండా హిట్ సాధిస్తుందని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు. ఆచార్య’ మూవీ కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఐదో షోతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ కూడా ‘ ఆచార్య’ మూవీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా వ్యయం రూ. 100 కోట్లు దాటడంతో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏప్రిల్ 29 నుంచి పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement