Wednesday, May 15, 2024

ఖానాపూర్ సీటు కోసం కాంగ్రెస్ కు రేఖానాయక్ ద‌ర‌ఖాస్తు… బిఆర్ఎస్ నుంచి హ‌స్తంకు జంప్

ఖానాపూర్ – బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కు ఈసారి పోటీ చేసేందుకు టిక్కెట్ ల‌భించ‌క‌పోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.. ఖానాపూర్ లో తన సత్తా చూపిస్తానని, బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటానని రేఖానాయక్ శపథం చేశారు. బిఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు.. కాగా, అధికార పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే మంగళవారం కార్యకర్తలు, అనుచరుల వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరు మోసం చేసినా నియోజకవర్గ ప్రజలు తనను మోసం చేయరని, వారంతా తనవెంటే ఉంటారని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో చేర‌క‌ముందే ఖానాపూర్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు ఎమ్మెల్యే రేఖానాయక్.. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ దరఖాస్తును తన పీఏతో గాంధీభవన్ కు పంపించారు.

ఇది ఇలా ఉంటే . సోమవారం సాయంత్రమే ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ తరఫున ఆసిఫాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి శ్యామ్ నాయక్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా నేడు రేఖా నాయ‌క్ కూడా రూ.25 వేలు క‌ట్టి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.. ఇక కాగా, 2014 తోపాటు 2018లోనూ ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై రేఖానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిందటి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎస్టీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించారు. అయితే, మంత్రి పదవి దక్కలేదు.. అప్ప‌టి నుంచి ఆమె అసంతృప్తితోనే ఉన్నారు.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసేందుకు జాన్స‌న్ కు అవ‌కాశం క‌ల్పించింది బిఆర్ఎస్ పార్టీ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement