Sunday, May 12, 2024

ఖమ్మం సభపై కో ఆర్డినేషన్ కమిటీ..

ఖమ్మం : తన పార్టీపై విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు వైఎస్ షర్మిల.  ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న ఖమ్మం సభపై వైఎస్ షర్మిల కో ఆర్డినేషన్ కమిటీ వేశారు. ఖమ్మం సభకి రాష్ట్ర వ్యాప్తంగా భారీ జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 100మంది ఖమ్మం జిల్లా నేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశం నిర్వహించనున్నారు. ఖమ్మం సభ నుంచి తన పార్టీపై పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు షర్మిల కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement