Friday, May 17, 2024

మహిళ దారుణ హత్య : హత్య చేసి బావిలో వేసిన దుండగులు

ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రు తండా గ్రామంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఒక మహిళను చంపి దుండగులు వ్యవసాయ బావిలో పడవేశారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని శవాన్ని వెలికితీసి విచారణ చేస్తున్నారు. ఆ మహిళకు 25 సంవత్సరాలుంటాయ‌ని సమాచారం. మహిళ ఎవరన్నది పోలీసులు విచార‌ణ‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement