Wednesday, May 1, 2024

KHM: వాట్సాప్ అడ్మిన్స్ తస్మాత్ జాగ్రత్త..

చంద్రుగొండ, అక్టోబర్ 21 (ప్రభ న్యూస్): సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, విమర్శలు చేసినా, వాట్సాప్ అడ్మిన్లపై, పోస్టులు పెట్టినా వారిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని జూలూరుపాడు సీఐ శ్రీనివాస్ తెలిపారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలకు తావివ్వరాదని తెలిపారు.

ర్యాలీలు నిర్వహించినా, సభలు నిర్వహించినా.. రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలన్నారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకు వెళ్ళేటప్పుడు సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాచినేని రవి, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement