Monday, April 29, 2024

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం: మంత్రి పువ్వాడ

ఖమ్మం కల్చరల్, (ప్రభన్యూస్) : ఖమ్మం నగరంలోని ఆర్యవైశ్యులు, వర్తక, వ్యాపారుల వ్యాపారానికి కాపాలదారుడిగా, అండగా ఉండి నిబద్దతో పనిచేస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బడ్జెట్ హోటల్లో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

‘‘మా నాన్న సీనియర్ పువ్వాడ నాకు ఇచ్చిన అస్తి ఆర్య వైశ్యులు’’ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు దుర్భరమైన స్థితిలో ఉన్న ఖమ్మం త్రీ టౌన్ నేడు అద్భుతంగా అభివృద్ధి చెందిన విషయం గుర్తు చేశారు. దశాబ్దాల నాటి నుండి వివక్షకు గురైన త్రీ టౌన్ ను నేడు రోడ్లు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ, పార్కులు, వాకింగ్ ట్రాక్ లు, కుడళ్ళ అభివృధ్ధి, మార్కేట్ లు, గాంధీ చౌక్ అభివృద్ధి, వీధి వ్యాపారుల ప్రాంగణాలు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి ఇలా అనేక పనులు చేశామని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement