Monday, April 29, 2024

Big Breaking | కేరళలో ఘోర ప్రమాదం..  టూరిస్టు బోటు బోల్తా, 9 మంది మృతి

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బోటు బోల్తా కొట్టడంతో 9మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన మలప్పురం తన్నూర్​ బీచ్​ దగ్గర ఇవ్వాల (ఆదివారం) కొద్దిసేపటి క్రితమే జరిగింది. టూరిస్టు బోటు బోల్తా పడడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బోటులో 40 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. బోటు ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement