Thursday, April 25, 2024

Kinnerasani Dam : కిన్నెరసానికి పోటెత్తిన వరద.. 6 గేట్లు ఎత్తివేత!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు శుక్రవారం ఉదయం 6 గేట్లు ఎత్తి 56 వేల క్కుసెక్కులు నీటిని దిగువకు వదిలారు. కిన్నెర‌సాని రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 404.40 అడుగులు ఉంది. యనంబైల్ చప్టా పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో కిన్నెరసాని అవతలి వైపు ఉన్న 10 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement