Wednesday, May 1, 2024

KHM: అభివృద్ధికి చిరునామా తెలంగాణ.. హరిప్రియ నాయక్

ఇల్లందు : దేశంలోని రాష్ట్రాలన్నింటికంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. ఇవాళ ఇల్లందు మండల పరిధిలోని బోయి తండాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకులకు జరుగుతున్న సంగ్రామంలో బీఅర్ఎస్ దే విజయమని అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలంటే మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, అందుకు ప్రజలందరూ కేసీఆర్ కు మద్దతు పలకాలని కోరారు. హరిప్రియ వెంట జెడ్పీటీసీ ఉమాదేవి, పంచాయతీ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement