Saturday, May 4, 2024

TS: అశ్వరావుపేటలో దంపతుల ఆత్మహత్య

అశ్వరావుపేట, అక్టోబర్ 5 (ప్రభ న్యూస్): దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇవాళ నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం అశ్వరావుపేట పట్టణంలోని మద్దిరావమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న ఎర్రం కృష్ణ (24), ఎర్రం రమ్య(20) లు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బంధువులు ఇంటికి వచ్చేసరికి తలుపులు తీయకపోవటంతో తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లో ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement