Monday, April 29, 2024

గుండెపోటుతో విద్యార్థి మృతి

ఏన్కూరు : మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన ఎస్.కె ఖాసీం పాషా(18) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో దుర్మరణం చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఖాసీం పాషా ఖమ్మంలో తాతయ్య నవాబ్ బేగ్ దగ్గర ఉండి ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి చాతిలో నొప్పిరావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలోనే దుర్మరణం చెందాడు. కార్పెంటర్ పనిచేసుకునే తండ్రి నాగుల్ మీరాకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మదర్ పాషా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చేతికొచ్చిన కుమారుడు అకాల మృతి పట్ల తల్లిదండ్రులు నాగుల్ మీరా, మహబూబీ కన్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. దీంతో రేపల్లెవాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement