Saturday, April 27, 2024

Khammam: యువ‌తిపై అత్యాచారం

ఖ‌మ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో ఓ యువతిపై యువ‌కుడు అత్యాచారం చేశాడు. గత నెల 31న ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి యువకుడుని అదుపులోకి తీసుకున్నారు.అత్యాచారానికి పాల్పడే సమయంలో యువకుడికి ఓ మాజీ ప్రజాప్రతినిది కుమారులు సహకరించి తనను చిత్ర హింసలకు గురిచేశారని బాధిత‌ యువతి ఆరోపించింది. అత్యాచారానికి పాల్పడిన యువకుడు, మాజీ ప్రజాప్రతినిది కుటుంబంతో తనకు ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోని తనకు నాయ్యం చేయాలని ఆ యువ‌తి కోరుతోంది. ఆ యువ‌తిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement