Thursday, May 2, 2024

ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలతో కలిసి.. ముంపు బాధితులను రక్షించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం (ప్ర‌భ న్యూస్‌) : ఖమ్మం నగరంలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF సిబ్బంది తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉదృతి ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ కలిసి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరదలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేయగా పలు ప్రాంతాల్లో NDRF సిబ్బందితో బోట్ లో ఇంటింటికీ వెళ్ళి క్షుణ్ణంగా వెతుకుతూ మైక్ ద్వారా వరదలో మునిగిన ఇంటి ముందు పిలుస్తూ.. ఇంకా ఇళ్ళల్లో చిక్కుకున్న వారికి రక్షించారు. NDRF కమాండర్, ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో విశాఖపట్నం నుండి వచ్చిన ప్రత్యేక బృందం లోతట్టు ప్రాంతాలైన పద్మావతి నగర్, గుర్రం ఫంక్షన్ హాల్ ప్రాంతం, మంచికంటి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో NDRF బృందం విస్తృతంగా పర్యటించి ఇళ్లలో, మెడ పైన మిగిలి ఉన్న బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement