Tuesday, April 30, 2024

KHM: వైద్యం విక‌టించి… బాలింత మృతి…

జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో బానోత్ చంద్ర (27) అనే బాలింత మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రసవం కోసం వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ‌మండలం టాక్య తండా గ్రామానికి చెందిన బానోత్ చంద్ర మొదటి కాన్పు ప్రసవం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాత శిశు కేంద్ర ఆస్పత్రిలో బుధవారం ఉదయం చేరింది. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం రాత్రి సుమారు 11 గంటలకు సాధారణ ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం బాలింతకు రక్తస్రావం ఆగకపోవడంతో ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు.

అప్పటికే రక్తస్రావం అధికంగా జరగడంతో కార్డియాక్ అరెస్టు అయి గురువారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో చంద్ర మృతి చెందిందని వైద్యులు తెలుపుతున్నారు. బంధువులు మాత్రం ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు. అయితే మాతా శిశు కేంద్రంలో వైద్యులగా విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్లు సొంత ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండడంతో ఇక్కడ వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఎక్కువ దృష్టి తమ సొంత ఆసుపత్రులపైన కేటాయించడంతో ఇక్కడి రోగులకు సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకే ఎంసిహెచ్ ఆసుపత్రిలో వరుస బాలింత మరణాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement