Friday, May 3, 2024

రోడ్డు ప్రమాదంలో ఐటీసీ క్యాజ్ వల్ ఉద్యోగి దుర్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పట్టణం ఐటీసీ సమీపంలోని ఎస్బిఐ బ్యాంకు వద్ద ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు,ద్విచక్రం పై ఉన్న గాంధీనగర్ కి చెందిన బుక్యా జవహర్ లాల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.కాగా స్థానికులు హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకు వెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

సారపాక పట్టణం నిత్యం ట్రాఫిక్ మయంతో ఉండి ప్రతిరోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంబంధిత అధికారులు మౌనం వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. బస్టాండ్ ప్రాంతంలో పుట్ పాత్ పై షాపులు దర్శనం ఇవ్వటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు అధికారులు తీరుపై విమర్శలగుప్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement