Tuesday, May 7, 2024

ఒక‌రితో ప్రేమ‌.. మ‌రొక‌రితో వివాహం.. ఇద్ద‌ర్ని బ‌లితీసుకున్న ట్రయాంగిల్ ల‌వ్ స్టోరీ

విశాఖ‌ప‌ట్నం – కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక(16) ఇటీవల ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్ట గా.. పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. నగరంలోని ఓ కళాశాలలో ఇం టర్ చదువుతున్న బాలికకు పలువురు పరిచయాలున్నాయి. ఆదర్శనగర్కు చెందిన సీపాన సూర్యప్ర కాష్ తో తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్కు చెందిన లెంకా సాయి కుమార్ను రహస్యంగా వివాహం చేసుకుం ది. ఆమె సూర్యప్రకాష్తో చనువుగా ఉండ డంతో సాయికుమారు నచ్చలేదు. అలాగే సాయికుమార్తో చనువుగా వ్యవహరిం చడం సూర్యప్రకాషకు నచ్చలేదు.

దీంతో వీరి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మ హత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలప ట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృ తదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్ గా గుర్తించారు. ఈ కేసులో లంకా సాయికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement