Saturday, April 27, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన మందుపాతర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని పాత చర్ల మామిడి తోటలో మందు పాతర పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్టు వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పలు ప్రాంతాలలో మావోయిస్టులు పోస్టర్లు వేశారు.

అయితే మామిడితోట సమీపంలో ఓ యువకుడు ఆ పోస్టర్లను బైక్‌పై ఉండే పరిశీలిస్తున్నాడు. దీంతో చెట్టు కింద మావోయిస్టులు వదిలివెళ్లిన మందుపాతర పేలిపోయింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా.. బైక్ ధ్వంసమైంది. స్థానికులు బాధితుడిని హుటాహుటిన సమీపంలోని స్థానికులు భద్రాచలంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement