Wednesday, April 24, 2024

‘రిపబ్లిక్’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల..

సుప్రీం హీరో సాయితేజ్ – దేవ కట్టా కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘రిపబ్లిక్’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. “సూడబోదుమా .. ఆడబోదుమా .. సెయ్యి సెయ్యి కలిపి సేరబోదుమా .. ” అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ సంగీతాన్ని హుషారైన సంగీతాన్ని అందిచారు. జాతర వాతావరణంలో జనంతో కలిసి హీరో ఆడిపాడే పాటగా ఇది కనిపిస్తుంది. పాటలో హీరోతో పాటు హీరోయిన్ కి కూడా చోటు ఉంది. జానపద బాణీలో ఊపుతో హుషారుగా ఈ పాట నడుస్తోంది. ఆంధ్రలో విశేషంగా జరిగే పెద్దింట్లమ్మ జాతర నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ బావుంది .. యూత్ పై మంచి ఉత్సాహభరితమైన స్టెప్స్ ను ఆయన కంపోజ్ చేశాడు. భగవాన్ – పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తోంది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న సాయితేజ్ ముచ్చట ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.

YouTube video

ఇది కూడా చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురు సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement