Friday, May 17, 2024

Khammam – పుడమి పులకరించేలా.. ప్రకృతి పరవశించేలా…హ‌రిత‌హారం – మంత్రి పువ్వాడ

ఖమ్మం : పుడమి పులకరించెలా.. ప్రకృతి పరవశించేలా.. హరితహారం పథకం రాష్ట్రంలో విప్లవాత్మమైన మార్పును సృష్టించిందని, రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పునర్ నిర్మాణ ఎజెండాను భుజానికి ఎత్తుకుని విజయవంతంగా అమలు చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం హరితహారం దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరం LB నగర్ లోని NSP కెనాల్ WALKWAY గట్టు పొడవునా 5వేల మొక్కల నాటే కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ లు ప్రారంభించారు.

అలాగే వెలుగుమట్ల ఫారెస్ట్ రేంజ్ నందు అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్రం పచ్చలహారంలా మారాలనే ఉద్దేశంతోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందని కోట్ల చెట్లు నాటడం వల్లే నేడు ఈ మాత్రం అన్న పర్యావరణం ను కాపాడుకున్నామని లేదని మనం తీవ్ర ప్రమాదంలో పడే వారం అన్నారు.
దశాబ్దాల కాలాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు కేసీఅర్ నడుం కట్టారని సంక్షేమం, అభివృద్ది పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన పచ్చని ప్రాంతంగా మార్చారని వివరించారు.
వాతావరణ సమతుల్యం సరిగా లేక సకాలంలో వర్షాలు పడక పర్యావరణం ప్రమాదంలో పడిందన్నారు. కేసీఅర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల 6శాతం అడవుల శాతం పెరిగిందన్నారు.

కెన‌డా లో ప్రతి మనిషికి 8,953, రష్యా 4,461, ఆస్ట్రేలియా 3,266, బ్రెజిల్ 1,494, యునైటెడ్ స్టేట్స్ 716 ఫ్రాన్స్ 182, యుకే 47 ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి మనిషికి 422 మొక్క‌లు ఉన్నాయన్నారు. చెట్లను కన్న పిల్లలు లాగా చుస్కోవల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. చెట్లే ఈ సృష్టికి జీవనాధారం అని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఅర్ హరితహారం కార్యక్రమాన్ని రూపకల్పన చేశార‌న్నారు పువ్వాడ‌. ప్రతి ఏడాది ప్రతి ఒక్క పౌరులను భాగస్వాములను చేసి ఇప్పటికే కొన్ని కోట్ల మొక్కలు విజయవంతంగా నాటారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటని పేర్కొన్నారు పువ్వాడ‌. మన వారసులకు, రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్చమైన గాలిని, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలని అంటూ గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది అని అన్నారు.

- Advertisement -


ఇలా ఆలోచించటంతో పాటు, ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కి దక్కిందనన్నారు. తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలో ప్రతీ ఒక్కరికీ అర్దం అయ్యేలా వివరించడంలో ముఖ్యమంత్రి సఫలం అయ్యార‌ని ప్ర‌శంసించారు.
కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కళ్ల ముందు ఆకు పచ్చగా పరుచుకున్నాయని, ఇన్నేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి ఆక్సీజన్ తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు.


హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచాయని, ఇలా రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లివిరియాలంటే తెలంగాణకు హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాలని పేర్కొన్నారు.
మొక్కలు నాటడం, వాటి సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాలని, ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటాడంజరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14, 864 నర్సరీల ఏర్పాటు చేశామని, హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10,822 కోట్ల ఖర్చు చేశామన్నారు.


ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(FSI) – స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం 2015-21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం పెరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి, సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కార్పొరేటర్లు , అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement