Tuesday, May 14, 2024

పెంచిన ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, విద్యుత్ ధరలు తగ్గించాలని టీపిసిసి పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో ఖమ్మం ధర్నాచౌక్లో జరిగిన ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలులో కేంద్రం, రాష్ట్రం డ్రామాలు కట్టిపెట్టి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ఖమ్మం నగర కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement