Sunday, April 28, 2024

Breaking: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోడీ ట్వీట్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కేసీఆర్ గాయమైందన్న విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధకలిగిందన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement