Tuesday, May 7, 2024

RR: స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఎంపిక అభినందనీయం..

వికారాబాద్, డిసెంబర్ 8 (ప్రభ న్యూస్): తెలంగాణ శాసనసభ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేయడం పట్ల వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, మాజీ మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు గురుపంతులు, కరుణాకర్ తదితరులు కలిసి శాలువా పూలమాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వికారాబాద్ నియోజకవర్గానికి మొదటిసారిగా స్పీకర్ పదవి రావడం అభినందనీయమన్నారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గా ప్రసాద్ కుమార్ నేపథ్యంలో జిల్లా అభివృద్ధి చెందాలని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement