Sunday, April 28, 2024

TS : ఇవాళ రెండు లోక్‌స‌భ నేత‌ల‌లో కేసీఆర్ భేటి…

మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ముఖ్యంగా నాగర్‌ కర్నూల్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు కేసీఆర్.

కాగా, నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసిఆర్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ బీఆర్ఎస్ భవన్ లో జరిగిన భేటీ తర్వాత..4 స్థానాల్లో పోటీ చేసే వాళ్లను అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ ,ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవితకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement