Monday, April 29, 2024

Condolence – నల్గొండ రోడ్డు ప్రమాదాలపై కెసిఆర్ దిగ్ర్రాంతి – ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్…

నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. కాగా..ఈ రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement