Monday, April 29, 2024

సుప్రీంలో క‌విత పిటిష‌న్ విచార‌ణ .. .. ప్ర‌తివాదుల‌కు నోటీసులు

ఢిల్లీ: లిక్కర్‌స్కాం విచార‌ణ‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేడు క‌విత పిటిషన్‌పై విచార‌ణ జ‌రిపిన స‌ర్వోత్న‌త న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కార్యాలయానికి రావాలంటూ ఈడీ తనకు పంపిన సమన్లను రద్దు చేయాలని కవిత ఈ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. మహిళలను దర్యాప్తు సంస్థల ఆఫీసుల్లో ఎలా ప్రశ్నిస్తారని?.. ఇంట్లోనే విచారించాలనే అంశంపై ఆమె కోర్టును ఆశ్రయరించారు. పిటిషన్‌లో నళిని చిదంబరం కేసును సైతం ఆమె జత చేశారు. ఈ తరుణంలో ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు కౌంటర్‌ ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆరువారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement