Sunday, April 28, 2024

Delhi : వైద్య పరీక్షలకు కవిత…కేంద్రబలగాల మోహరింపు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కవితను అరెస్ట్ చేసిన ఈడీ రాత్రికి రాత్రి ఢిల్లీ తీసుకెళ్లారు. కాగా ఇవాళ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కల్వకుంట్ల కవితను ప్రవేశపెట్టబోతున్నారు.

- Advertisement -

కాగా కవితకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మహిళ డాక్టర్​లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి కూడా కవితకు వైద్యపరీక్షలను నిర్వహించారు. ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుచనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భారీగా కేంద్రబలగాలు మోహరించాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పహారా నిర్వహించేందుకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement