Wednesday, May 8, 2024

Peddapalli: బీఆర్ఎస్ తోనే సంక్షేమం.. ఎమ్మెల్యే దాసరి

భారత రాష్ట్ర సమితితోనే సంక్షేమం సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఓదెల మండలం గుండ్లపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పథకాలను గమనించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడమే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.

గత పాలకుల హయాంలో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని, గత తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసి రాబోయే ఎన్నికల్లో మరోసారి ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు. మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు విడుదల చేశారన్నారు. గతంలో ఏ పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపామన్నారు. అధికారంలో ఉన్న నాడు ఏమి చేయలేని దద్దమ్మలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అసత్యపు ప్రచారాలు చేస్తారన్నారు. పెద్దపల్లి ప్రజలు దొంగ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని, మూడోసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యేగా మూడోసారి అవకాశం ఇవ్వాలని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీములను దొంగ ప్రచారం చేస్తుందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement