Tuesday, April 30, 2024

రాజీవ్ రహదారిపై వంటావార్పు..

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. శుక్రవారం భారత రాష్ట్ర సమితి శ్రేణులు రాజీవ్ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున 450 రూపాయలున్న గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1200కు చేరడం శోచనీయమన్నారు. గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యులు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement