Tuesday, April 16, 2024

లక్ష్మీనారాయణ స్వామి పూజల్లో పాల్గొన్న‌ చిన్న జీయర్ స్వామి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3) ప్రభ న్యూస్ : పుణ్యక్షేత్రం వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన మహిళా సామూహిక లక్ష్మీనారాయణ స్వామివారి పూజలకు శ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు. శుక్రవారం చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష వీక్షణలో స్వామివారి పూజలు చేయించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… ప్రపంచ శాంతి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సంతోషంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వట్టెం దేవాలయ వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాపరెడ్డి, కొత్త చంద్రారెడ్డి, సందడి రామచంద్రా రెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అనంత నరసింహారెడ్డి, నిత్యాన్నసత్రం అధ్యక్షులు వాసవిశ్వరయ్య, వట్టెం గ్రామ సర్పంచ్ అమృత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement