Thursday, May 2, 2024

మల్లన్నపై చర్యలు తీసుకోవాలి

అధికారులను, ప్రజాప్రతినిధులను దూషిస్తూ వారి పరువుకు భంగం కలిగిస్తున్న తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి డిసిపికి ఫిర్యాదు చేశారు. బుధవారం డిసిపి కార్యాలయము డిసిపి రవీందర్ ను కలిసి మీడియాను అడ్డం పెట్టుకుని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎస్సై రాజేష్ ల ను దూషిస్తూ వారి పరువుకు భంగం కలిగించారు. ఈ విషయం పై విచారణ జరిపి మల్లన్న పై చట్టరీత్య చర్య తీసుకోవాలని తెరాస నాయకులు కాశి పాక వాసు, వెన్నం రవీందర్, బొంకురి నిఖిల్, తాళ్ల కళ్యాణ్, కొంకటి లింగమూర్తి, బొంకురి అఖిల్, మహేష్,  మనికంట, శ్రీను,హరీష్,చిన్ను, జునెర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement