Sunday, April 28, 2024

ట్రాలీ బోల్తా.. ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు

కూలీలను తీసుకు వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తా పడిన సంఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలైన సంఘటన పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ వద్ద చోటుచేసుకుంది. సోమవారం అబ్బాపూర్ గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చొప్పదండి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement