Friday, March 29, 2024

Flash: ఆటో ట్రాలీ బోల్తా.. ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు

కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తా పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో పెద్దాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సోమవారం అబ్బాపూర్ గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చొప్పదండి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement