Monday, April 29, 2024

ట్రాక్టర్ దొంగల అరెస్టు..

జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో అక్రమంగా సంపాదించాలని ట్రాక్టర్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పెద్దపల్లి మండలం హనుమంతుని పేట గ్రామానికి చెందిన గుర్రాల శ్రీకాంత్, గుర్రాల సతీష్ లు ట్రాక్టర్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. నవంబర్ 30వ తేదీన మండలంలోని రాంపల్లి లో ముష్కే చంద్రమోహన్ తన ట్రాక్టర్ను ఇంటి అడుగు స్థలంలో నిలిపి ఉంచగా నిందితులు దొంగలించి గురువారం దానిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఇరువురిని అదుపులోకి తీసుకొని అపహరించిన ట్రాక్టర్ తో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ దొంగతనం కేసును చేదించిన పెద్దపల్లి ఎస్ఐ లు రాజేష్, రవీందర్, సిబ్బంది దుబాసి రమేష్ లను సిఐ ప్రదీప్ కుమార్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement