Monday, April 29, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు శిక్ష..

మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి ఒకరోజు జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన బసంత్ నగర్ కు చెందిన కాచపాక రవి, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన అప్పాల మధుసూదన్, పెద్దపల్లి చెందిన కొంతం సంపత్ లను జూనియర్ సివిల్ జడ్జి రాణి ఎదుట హాజరు పరచగా ఒక్కొక్కరికి 500 రూపాయల జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నిలబెడితే నిర్మాణాలతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement