Sunday, May 5, 2024

ప్రాణం తీసిన వాటర్‌ బాటిల్‌… ప్రమాదంలో విద్యార్థిని మృతి..

ఎన్‌టీపీసీ : స్కూల్‌ ఆటోలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని కింద పడిపోయిన వాటర్‌ బాటిల్‌ కోసం అందులో నుంచి దూకడంతో ప్రమాదానికి గురై మృతి చెందిన విషాద సంఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్కలపల్లికి చెందిన విద్యార్థిని గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం టాటా మేజిక్‌ స్కూల్‌ ఆటోలో ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్తుండగా ఎల్కలపల్లి గేట్‌ ఆర్‌ఎఫ్‌సిఎల్‌ టౌన్‌ షిప్‌ సమీపంలో వాటర్‌ బాటిల్‌ కింద పడిపోయింది. దీంతో వాటర్‌ బాటిల్‌ కోసం ఒక్కసారిగా వ్యాన్‌లో నుంచి విద్యార్థిని దూకి ప్రమాదానికి గురైంది. దీంతో విద్యార్థిని తలకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌ లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే డాక్టర్లు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు స్పష్టం చేశారు. పాఠశాలకు వెళ్లాల్సిన కూతురును మార్గమధ్యంలో వాటర్‌ బాటిల్‌ రూపంలో మృత్యువు కబలించడంతో విద్యార్థిని త‌ల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడు మానసిక వ్యాధితో బాధపడుతుండగా, కూతురు ఇలా ప్రమాదంలో మృతిచెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement