Thursday, May 2, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. కరీంనగర్ ఏసీపీ నరేందర్

శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ పేర్కొన్నారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సరఫరా చేసినా, విక్రయించినా కేసులు తప్పవన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ నరేందర్ కు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement