Saturday, May 4, 2024

బావ‌మ‌రిదిని హ‌త్య చేసిన బావ

బావ మ‌రిదిని బావ హ‌త్య చేసిన ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో బావమరిదిని బావ‌ హత్య చేశాడు. వివరాల్లో వెళితే కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఖాదీర్, సలీం ఇద్దరు గత రాత్రి రూరల్ మండలం మొగ్దుంపూర్ లోని వైన్స్ వెనుకల మద్యం సేవిస్తున్న సమయంలో కుటుంబ కలహలతో ఇద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బావమరిది అయిన‌ ఖాదీర్ ను బావ సలీం బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. సంఘటన స్థలాన్ని పరీశీలించిన రూరల్ సిఐ విజాన్ రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు వెళ్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement