Tuesday, April 30, 2024

టీ బీజీకేఎస్‌ నేతలకు కేంద్ర కమిటీలో చోటు

గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలోని టీ బీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయం జరిగిన సమావేశంలో సంఘం కేంద్ర కమిటీలో పలువురు నాయకులకు చోటు కల్పించారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి కేంద్ర కార్యవర్గంలో రామగుండం రీజియన్‌కి చెందిన సీనియర్‌ నాయకులు నూనె కొమురయ్యను ఉపాధ్యక్షులుగా, కనకం శ్యాంసన్‌ను డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీగా, వడ్డేపల్లి శంకర్‌ని చీఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా ప్రకటించారు. తమ నియామకానికి సహకరించిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ఎంపీ వెంకటేష్‌ నేత, మేయర్‌ అనిల్‌ కుమార్‌, సంఘ అధ్యక్షులు బి. వెంకట్రావు, కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రామగుండం రీజియన్‌లోని టీబీజీకేఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement