Friday, May 3, 2024

సుమనన్న జనం బాట.. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కారం..

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నాయకుడి వద్దకు వెళుతుంటారు ఇది మామూలే.. కానీ జనం వద్దకే నాయకుడు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడమే విశేషం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమన్ అన్న జనం బాట పేరిట ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పర్యటించారు. ప్రజల ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు చెన్నూరు శాసన సభ్యులు బాల్కసుమన్ మాట్లాడుతూ.. తనను నమ్మి గెలిపించిన ప్రజల వద్దకే వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తమ ఇంటికి ఎమ్మెల్యే వచ్చి సమస్యలు అడిగి పరిష్కరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement