Tuesday, May 7, 2024

శ్రీవారి చల్లని చూపు రామగుండం ప్రజలపై ఉండాలి.. ఎమ్మెల్యే కోరుకంటి

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి చల్లని చూపు రామగుండం ప్రజలపై ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే కోరుకొండ చందర్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. 7 వారాలు శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనంతో పాటు తలనీలాల సమర్పణలో భాగంగా 2వ వారం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధపడ్ద మహానాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తిరుమల శ్రీవారి చల్లని చూపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కేటీఆర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు రామగుండం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నామన్నారు.

ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించామన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించాలన్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. 8ఏళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో అనందం నింపిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని స్వామివారు ప్రసాదించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాల రక్షణ కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement