Tuesday, April 30, 2024

ఆరెపల్లి ప్రభుత్వోన్నత‌ పాఠశాలను దత్తత తీసుకున్న శాతవాహన లయన్స్‌ క్లబ్‌

కరీంనగరంలో సీనియర్‌ క్లబ్బుల్లో ఒకటైన శాతవాహన లయన్స్‌ క్లబ్‌ ఆరెపల్లి గ్రామాన్ని, ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని అత్యవసర సేవలను అందిస్తోంద‌ని అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌ రావు తెలిపారు. ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఆరెపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించి కార్యక్రమంలో కంప్యూటర్‌ టేబుల్‌ను అందజేశారు. పాఠశాల సూచనల మేరకు పలు సేవలను చేస్తామని, విద్యార్థినీ, విద్యార్థులు కష్టపడి.. ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థితికి చేరాలని సూచించారు. అతిథిగా హాజరైన కార్పొరేటర్ తుల రాజేశ్వరి‌ బాలయ్య మాట్లాడుతూ మంచి మనస్సుగల లయన్స్‌ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడం హర్షదాయకమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement