Tuesday, May 7, 2024

మిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం

జూలపల్లి: మండలంలోని కుమ్మరికుంట గ్రామానికి చెందిన ఎక్కిరాల రామయ్య అనారోగ్యంతో మృతిచెందగా అతని కుటుంబానికి 1996-97 బ్యాచ్‌కి చెందిన తోటి మిత్రులు చేయూతనందించారు. కోడూరి చందు రూ. 4వేలు, కోడం పరమేశ్వర్‌ రూ. వెయ్యి చొప్పున రామయ్య భార్యకు రూ. 5వేల ఆర్థికసాయం అందించారు. ఈకార్యక్రమంలో కుమ్మరికుంట సర్పంచ్‌ సంతోష్‌రావు, ఈర్ల స్వామి, కొండ మల్లేశ్‌, వొల్లాజి శ్రీనివాస్‌, సురేందర్‌, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement