Monday, April 29, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలి

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై రాజ వర్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి 24 గంటలపాటు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మండలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని మహిళల పట్ల దురుసుగా వ్యవహరించిన అసభ్యకరంగా ప్రవర్తించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు కచ్చితంగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రాజ వర్ధన్ కు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement