Sunday, April 28, 2024

Peddapalli: ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం.. డీసీపీ చేతన

ప్రజాస్వామ్య పరిరక్షణే పోలీసుల ధ్యేయమని పెద్దపల్లి డీసీపీ డాక్టర్ చేతన తెలియజేశారు. శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు తప్పవన్నారు. ఎన్నికల నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. బాధ్యతలు స్వీకరించిన డీసీపీకి పెద్దపల్లి గోదావరిఖని ఏసీపిలు ఎడ్ల మహేష్, తులా శ్రీనివాసరావు, తోపాటు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement