Sunday, May 5, 2024

PPL Cricket : క్రికెట్ పోటీలు ప్రారంభం.. మంథని పై సుల్తానాబాద్ విజయం

పెద్దపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం పెద్దపల్లి జిల్లా లోని మంథని జేఎన్టీయూ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలను పెద్దపల్లి డిసిపి చెన్నూరి రూపేష్ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని సర్కిల్ల టీంలు పాల్గొననున్నాయి. మొదటి మ్యాచ్ లో మంథని జట్టు పై సుల్తానాబాద్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సుల్తానాబాద్ నిర్ణీత 12 ఓవర్ లలో 95 పరుగులు చేయగా మంథని జట్టు 12 ఓవర్ లలో 79 పరుగులు చేయగా సుల్తానాబాద్ 16 పరుగులతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి రూపేష్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు లీగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జట్టు లీగ్ దశలో ఐదు టీం లతో ఆడుతుందని, ఎక్కువ పాయింట్లు సాధించిన నాలుగు జట్లు సెమి ఫైనల్ కు చేరుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గిరి ప్రసాద్, సారంగపాణి, సిఐలు సతీష్, ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, వేణుగోపాల్, చంద్రశేఖర్, రమేష్ బాబు తో పాటు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement