Friday, May 10, 2024

పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలి : మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌

కరీంనగర్ నియోజకవర్గంలో పెండింగ్ పనులను త్వరిత్తగాతిన పూర్తి చేయాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. సోమ‌వారం నియోజకవర్గంలోని ఎంపీటీసిలు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాల‌న్నారు. నియోజకవర్గం అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మార్చ్ 31 వరకు పూర్తి చేయాల‌న్నారు. ఇప్పటికే 80% పనులు పూర్తి చేసాం, ఏప్రిల్ నుండి కొత్త బడ్జెట్ పనులు ప్రారంభించాల‌న్నారు. కాబట్టి మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాల‌న్నారు. పంచాయతీ రాజ్ నిధులతో టెండర్లు పూర్తి అయిన పనులు వెంటనే పూర్తి చేయాల‌న్నారు. మిగిలిన పనులకు అంచలానాలు సిద్ధం చేయాల‌న్నారు. నియోజకవర్గంలో మిగిలిన సంఘ భవనాల‌కు నిధులు మంజూరు చేస్తామ‌ని, త్వరిత గతిన పూర్తి చేయాల‌న్నారు. వర్షాకాలం లోపల పంచాయతీ రాజ్ రోడ్లన్ని పూర్తి చేయాల‌ని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను మంత్రి గుంగ‌ల ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement