Tuesday, April 30, 2024

అసలైన రైతు బాంధవుడు.. కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ పెద్దపెల్లి జిల్లాలోని హనుమంతుని పేటలో రైతులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం గ్రామంలోని వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజలు తామే ఉంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో డైరెక్టర్ మేకల కుమార్, రైతులు బండి సతీష్, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, కిషన్రావు, సునీల్, హరీష్, రాములు, సంజీవ్, సుమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement